యాదాద్రి భువనగిరి : ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తూ పంచాయతీ సెక్రటరీ(Panchayat secretary) ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు పంచాయతీ సెక్రటరీ కిరణ్ ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కిరణ్కు రూ. 3వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.