హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ప్రమాణం స్వీకరించారు. శాసనమండలి చైర్మన్ ప్రొటెం వీ భూపాల్రెడ్డి తన చాంబర్లో పల్లా రాజేశ్వర్రెడ్డి చేత ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, మహమూద్అలీ, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభివాణీదేవి, బోడకుంటి వెంకటేశ్వర్లు, శేరి సుభాష్రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, పట్నం మహేందర్రెడ్డి, గంగాధర్గౌడ్, పురాణం సతీశ్, తేరా చిన్నపరెడ్డి, ఫారూక్ హుస్సేన్, దామోదర్రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అరూరి రమేశ్, నోముల భగత్, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, కే వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్కుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కే కిశోర్గౌడ్, శుభప్రద్ పటేల్, సీహెచ్ ఉపేంద్ర, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి తదితరులు పల్లా రాజేశ్వర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
పట్టభద్రులకు ఇచ్చిన అనేక హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎవరెన్ని ప్రచారాలు చేసినా 2023లో తిరిగి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమం త్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 2 లక్షలపైగా ఓట్ల తో గెలిపించిన పట్టభద్రులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పదోన్నతుల విషయంలోనూ సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని, ఉద్యోగ నియామక ప్రక్రియ ను త్వరలోనే చేపడతారని వివరించారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి నేటివరకు ఎప్పుడు ఏ ఎన్నిక లు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. చిన్నారి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రాజు పశ్చాత్తాపంతోనే రైలు కిం ద ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తెలిపారు.