హిమాయత్నగర్, నవంబర్2: చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో వారు మాట్లాడుతూ జీఎస్టీ విధించడంతో చేనేత వస్ర్తాల అమ్మకాలు తగ్గడంతోపాటు కార్మికులపై ఆర్థికభారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు చేనేతను ప్రోత్సహిస్తుంటే కేంద్రం వ్యతిరేక వైఖరి అవలంబించడం సరైనది కాదని పేర్కొన్నారు. పద్మశాలీ మహిళా, యువజన సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. పద్మశాలీలు సంఘటితమై ప్రభుత్వపరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు.