హైదరాబాద్ : రేపు గాంధీభవన్(Gandhi bhavan)లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC Meeting) సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ(Congress )లో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అలాగే పార్టీ బలోపేతం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పథకాల అమలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులను సమాయత్తం చేయడం వంటి తదితర అంశాలను చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.