హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఇక సోయాబీన్ 3.39 లక్షల ఎకరాల్లో సాగైంది. నిరుడు ఇదే సమయానికి 81.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.