Fake Seeds | నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టయ్యింది. సైబరాబాద్ పరిధిలోని అన్ని జోన్లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు 3.3 టన్నుల నకిలీ సీడ్స్ను సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఎస్ఓటీ పోలీసులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ధర కంటే తక్కువకు విత్తనాలు వస్తే రైతులు అనుమానించాలని సలహా ఇచ్చారు.