హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన 25 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా హైదరాబాద్ చేరుకొని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువా కప్పిన మంత్రి వేముల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని ఈ సందర్భంగా మంత్రి వేముల వ్యాఖ్యానించారు. పార్టీలో చేరిన వారిలో రామన్నపేట గ్రామంలో కాగ్రెస్ పార్టీ నాయకుడు శోభన్ రెడ్డి, బీఎస్పీ నేత భూమా రెడ్డితోపాటు తిరుపతి, నరేష్, లింబద్రి, రణవీర్, గంగాధర్, గంగమల్లు, గోపి, మర్రి అశోక్, తిరు మహిపాల్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాగధర్, రాములు, మోహన్ రెడ్డి, పురుషోత్తం సర్పంచ్ శోభన్, నరేందర్, జువ్వాజి వేణు, పందేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.