జనగామ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తండాలను నూతన గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ అధ్యక్షులు జగన్, సురేష్, అశోక్, సిద్దు అధ్వర్యంలో గౌతమ్, వినోద్, సందీప్, ప్రవీణ్, వెంకన్న, సతీష్, సాయి, సుమన్ , యాకు, శ్రీను, వంశీ, యాకన్న, రవి, హరీష్, నవీన్, చందర్,సోమన్న, సాయి రామ్, మంగర్, నిమా, భాస్కర్, నవీన్, రాజు, స్వామి, రమేష్, సోమన్న, స్వామి, తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఎస్టీలను ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నది దేశంలో ఒక్క సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై, అభివృద్ధిలో భాగస్వాములం కావడానికి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దయాకర్రావును అధిక మెజారిటీ తో గెలిపించేందుకు కృషి చేస్తామన్యనారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.