హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సోమాజీగూడ యశోద హాస్పిటల్లో(Yashoda Hospital) వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్(Operation)ను చేస్తున్నారు. కేసీఆర్ (KCR) కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.