హైదరాబాద్ మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహించనున్నట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన పరీక్షలు మే 2న ముగుస్తాయని వెల్లడించారు.
ఇంటర్మీడియట్, పదోతరగతి విద్యార్థులకు సమాంతరంగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలను మే 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని శ్రీహరి పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం మరో అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. పదోతరగతి విద్యార్థులు తత్కాల్కింద రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1,000 ఆలస్య రుసుముతో ఈ నెల 18 నుంచి 21 వరకు పరీక్షఫీజు చెల్లించవచ్చని సూచించారు.