నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతున్నది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 8,950 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ఫ్లో సమానంగా ఉండడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90.313 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1090.40(86.41 టీఎంసీలు) అడుగుల వద్ద ఉన్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి 118.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇప్పటి వరకు కాలువలు, వరద గేట్ల ద్వారా మొత్తం 50.28 టీఎంసీల నీటిని వదిలారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
హుజూరాబాద్లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం