హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులను కేంద్రంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించి వారికి మనోధైర్యం, ఆర్థిక చేయూత అందించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదలచేశారు. కరోనా సెకండ్వేవ్ ప్రభావంతో దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణలో విధి నిర్వహణలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 55 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారని వారు వెల్లడించారు. ఒక ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో వరుసగా 29 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు వారు పేరొన్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు 3,800 మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు అందిస్తున్న రూ.2 లక్షలు ఆర్థిక సహాయం దవాఖాన ఖర్చుల కోసం చేసిన అప్పులకు కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దికుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కనీసం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు వైద్య సేవలందించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని కోరారు. పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు