జనగామ : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు ఓ ప్రాణాన్ని బలితీసుకోగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో లింగాల ఘనపురం మండలం కుందారం కెనాల్ వద్ద వారు ప్రయాణిస్తున్న ఎర్టీగా వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో నుజ్జునుజ్జయింది. మృతురాలిని సింధూజగ గుర్తించారు.
ఈ ప్రమాదంలో సింధూజ అనే మహిళ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను108 వాహనంలో చికిత్స నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు. కాగా, అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.