ములుగు, డిసెంబర్27 : ద్విచక్ర వాహనం(Bike) డివైడర్(Divider)ను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన ములుగు(Mulugu) జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులో హనుమకొండ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు. మృతుడు ఎటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురం గ్రామానికి చెందిన మల్యాల అనిల్ కుమార్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.