హైదరాబాద్ : చిరుతపులిని( Leopard) వేటాడిని కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్(One Person arrested) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 25న మెదక్( Medak Dist) జిల్లా దౌల్తాబాద్ వద్ద అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చులు అమర్చారు. అయితే ఆ ఉచ్చుల్లో చిక్కుకొని చిరుతపులి మృతి చెందింది. దీంతో నలుగురు వేటగాళ్లు చిరుత గోళ్లు సకరించి కళేబరాన్ని దహనం చేశారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిరుతపులి దహనం కేసులో ఒకరు అరెస్ట్ కాగా, మరో ముగ్గురు నిందితులు పరారయ్యారు. మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.