న్యూఢిల్లీ : యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో క్షిపణి దాడికి గురైన భారతీయ జెండాతో కూడిన ఒక వాణిజ్య నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ రక్షించి, మోఖా నౌకాశ్రయానికి తరలించారు.
వారిలో 13 మంది భారతీయులు కాగా, ఒకరు విదేశీ జాతీయుడని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం వెల్లడించారు. దాడి వెనుక హౌతి రెబల్స్ ప్రమేయం ఉండవచ్చని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.