వరంగల్: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి లారీల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
కాగా, ఇద్దరు డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పారు. వారిలో ఒకరు దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. ఈ యాక్సిడెంట్తో జాతీయ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రెండు లారీలను రోడ్డుపైనుంచి తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు.