హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తు్న్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.