కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వేములవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో మినీ బస్సు బోల్తాపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ఉన్నారని చెప్పారు.