హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల మధ్య చిక్కుకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడెం వాసి జంగయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.