హైదరాబాద్: హైదరాబాద్లోని మాదాపూర్లో కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడని దవాఖానకు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మరోఘటనలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారపడ్డారు. స్థానికుల సహాయంతో బాధితులను పోలీసులు దవాఖానకు తరలించారు. ముగ్గురు యువకులు చిట్యాల నుంచి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా ముందున్న వాహనాన్ని ఢీకొట్టారని పోలీసులు తెలిపారు.