హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చిత్ర ప్రదర్శనను సీఎం కేసీఆర్ తిలకించారు. పైలాన్ చుట్టూ ఏర్పాటు చేసిన గార్డెన్లో పెద్ద మొక్క నాటారు. అనంతరం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున ఆరుగురు లబ్ధిదారులకు పట్టా, తాళాలను సీఎం కేసీఆర్ అందజేశారు. 93 బ్లాక్లోని 106, 107, 109 నుంచి 112 వరకు డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, తలసాని, మహమూద్ ఆలీ, సబిత, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాదవరం కృష్ణారావు, బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్కుమార్, ఎస్ఈ విద్యాసాగర్, జోనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు సింగిల్ రూంలో కిరాయికి ఉన్నాం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇంటి తాళం చెవి తీసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ఆయన చేతుల మీదుగా ఫ్లాట్109 ఇంటి పట్టా తీసుకోవడం ఆనందంగా ఉంది. సొంతిల్లు లేక ఎన్నో కష్టాలు పడ్డాం. మీసేవలో దరఖాస్తు చేసుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా ఇంత మంచి ఇల్లు రావడం నిజంగా అదృష్టం.
– ముదావత్ శారద, అంజయ్యనగర్, కొండాపూర్
23 ఏండ్ల నుంచి రెంట్కు ఉన్నాం. భర్త చనిపోయి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా కష్టాలను దేవుడిలాగా సీఎం కేసీఆర్ దూరం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా మాకు ఫ్లాట్ నంబర్ 106 ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా పదికాలాలు కొనసాగాలి.
-గడ్డమీది రేణుక, పటాన్చెరు
కిరాయి కట్టుకుంటూ సింగిల్ రూంలో ఉండేదాన్ని.. ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంటికి ఓనర్ని చేసింది. కేసీఆర్ చేతులమీదుగా ఇంటి పట్టా అందుకుంటామని అస్సలు అనుకోలేదు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది మాకు.
– పుల్లిగిల్ల దేవి, పాపిరెడ్డికాలనీ, శేరిలింగంపల్లి
మాకు ఇద్దరు పిల్లలు. 15 ఏండ్లుగా ఒక గదిలోనే కిరాయికి ఉన్నాం. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వస్తదని అనుకోలేదు. కేసీఆర్ సర్కార్ మాకు ఇల్లు ఇచ్చినందుకు ధన్యావాదాలు. మరోసారి కూడా సీఎం కేసీఆర్ సర్కారే అధికారంలోకి రావాలి.
– ఆసియాబేగం, పటాన్చెరు
మాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్కు ధన్యావాదాలు. 10 ఏండ్లుగా కిరాయికి ఉంటున్న మాకు ఇల్లు మంజూరైందని తెలిసి సంతోషపడ్డాం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫ్లాట్ నంబర్ 111 ఇంటి పట్టా, తాళం తీసుకోవడం మాకు జీవితంలో మర్చిపోలేనిది.
– చాకలి సుజాత, రాజేందర్నగర్
డబుల్ బెడ్రూం ఇల్లు చాలా బాగుంది. కేసీఆర్ చేతుల మీదుగా ఇల్లు తీసుకోవడం అదృష్టం. 13 ఏండ్లుగా కిరాయికి ఉన్నాం. నెలకు రూ.5 వేల కిరాయి కట్టాం. ఇప్పుడు సొంతిల్లు వచ్చింది.. చాలా సంతోషంగా ఉంది.
-కేతావత్ కీర్తి, కాటేదాన్, ఉడుమ్గడ్డ