నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, జనవరి 10: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో హరీశ్రావు మాట్లాడు తూ.. కంటి చూపుతో ఏ ఒక్కరూ బాధపడొద్దని సీఎం కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారని అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక కంటి పరీక్షల కార్యక్రమమని చెప్పారు. రూ.250 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు.
గ్రామాల్లోనే బస చేస్తా: నిరంజన్రెడ్డి
జోగుళాంబ గద్వాల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆయా ఎమ్మెల్యేలు కోరితే మూడు రోజులు సదరు గ్రామాల్లో బస చేయడానికి తాను సిద్ధమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కంటివెలుగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..
కంటి వెలుగులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలక పాత్రపోషించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఆదిలాబాద్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం రూ.250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నదని తెలిపారు.
కంటి సమస్యలను దూరం చేయడానికే..
కంటి సమస్యలను దూరం చేయడానికే కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో కంటి వెలుగుపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ..అంధత్వరహిత తెలంగాణను ఆవిషరించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని సాకారం చేయాలని కోరారు.