Kamareddy | కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి బయట కూర్చున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేసి చంపేశాయి.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో గురువారం ఉదయం ఇంటి బయట కూర్చున్న రామవ్వ (60)పైకి వీధికుక్కలు ఒక్కసారిగా ఎగబడ్డాయి. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే వీధికుక్కలను వెళ్లగొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రామవ్వను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామవ్వ మరణించింది.