మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 20: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 12 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను కొనసాగిం చగా 1021 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు. మొదటి, రెండో డోస్లకు సంబంధించి వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్స్ 107, 60 ఏళ్ల పై బడిన వారు 405, 45-59 మధ్య వయస్సు వారు 509 మంది టీకా వేసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 49,242 మంది టీకా తీసుకున్నారని వ్యాక్సినేషన్ అధికారి ఫయాజ్ఖాన్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో 92 మందికి కరోనా..జిల్లా కేంద్రంలో మంగళవారం 310 మందికి ర్యా పిడ్ పరీక్షలు నిర్వహించగా 92 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. జిల్లా ప్రభుత్వ దవాఖానలో 60, పాతమంచిర్యా ల అర్బన్ హెల్త్ సెంటర్లో 20, రాజీవ్నగర్ యూపీహెచ్సీలో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.
శ్రీరాంపూర్, ఏప్రిల్ 20 : రెండు నెలలుగా ప్రభుత్వం కొవిడ్ టీకాలు వేసుకునేందుకు సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఆసక్తి చూపలేదు. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో మంగళవారం శ్రీరాంపూర్ ఆర్కే 8కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీకి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున టీకా వేసుకునేందుకు తరలి వచ్చారు. వ్యాక్సిన్ కొరత ఉండడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. దవాఖాన డిప్యూటీ సీఎంవో విజయలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ సుమన్ కార్మికులకు వ్యాక్సిన్ ఏరోజుకు ఆరోజే తమకు అందుతుందని, ముందస్తు సమాచారం తమకు కూడా ఉండడం లేదని తెలుపడంతో కార్మికులు శాంతించారు.