Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ కర్నాటకను ఏటీఎంలా వాడుకుంటోందని తమిళనాడు బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం కాంగ్రెస్ కర్నాటకను నిధుల కోసం ఏటీఎంలా వాడుకుంటుందని కాషాయ పార్టీ ప్రజలను హెచ్చరించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ ఖాళీ చేస్తోందని దుయ్యబట్టారు.
మాజీ సీఎం బొమ్మై పదవి నుంచి దిగిపోయినప్పుడు కర్నాటక ఆదాయంలో మిగులు రాష్ట్రంగా ఉందని గుర్తుచేశారు. అలాంటి కర్నాటక ఇప్పుడు ఆదాయ లోటుతో సతమతమవుతోందని అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన వైఖరితో ఉన్నారని, గతంలో చేసిన పొరపాటు పునరావృతం కారాదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
కర్నాటకలో మొత్తం 28 స్ధానాలను బీజేపీ-ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా శాంతిభద్రతల పరిస్ధితి దారుణంగా ఉంటుందని, వారు అన్నిరకాల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడతారని హుబ్బలిలో జరిగిన ఘటన ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఇక ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో కర్నాటకలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Read More :
Congress | ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి!.. ఏఐసీసీకి తలనొప్పిగా మారిన ఎంపీ అభ్యర్థి ఎంపిక