హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ(Congress) పనిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka )అన్నారు. కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. అలాగే హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ (BJP) అగరబత్తీల (Incense sticks)పై కూడా జీఎస్టీ(GST) విధించిందని విమర్శించారు.
ఇది ఆ పార్టీకి హిందులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఎస్టీ తెచ్చి రూ. 54లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. మోదీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. అలాంటి పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.