కన్నూరు: ఏ నాగరిక దేశమైనా మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వదని కేరళ సీఎం విజయన్(CM Vijayan) అన్నారు. దేశంలోని సెక్యులర్ భావాలకు పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేకమని ఆయన తెలిపారు. సెక్యులరిజం రక్షణ కోరుతూ సీఏఏకు వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి నిరసన తెలుపులేదన్నారు. రాష్ట్రంలో లోకసభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మట్టన్నూరులో ఆయన ప్రసంగిస్తూ.. ఏ నాగరితక దేశమైన మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వలేదన్నారు. మతాన్ని ఆధారం చేసుకుని కాందిశీకలను విడదీయదన్నారు. పౌరసత్వాన్ని ఇచ్చి దాని ఆధారంగా మతాన్ని క్రియేట్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకోవడం లేదన్నారు. ఏప్రిల్ 26వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎప్ కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.