హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రతి అబ్జర్వర్ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న 2,100 మంది పోలీస్, జనరల్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్కుమార్ మాట్లాడారు.