హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పూర్తిగా రద్దయింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నుమాయిష్ను రద్దు చేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయం ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నుమాయిష్ను మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ సొసైటీకి సూచించారు.
అయితే, పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఇప్పటికే నుమాయిష్లోకి ప్రజలకు అనుమతిని నిలిపివేసిన విషయం విధితమే. తాజాగా పోలీసులు సైతం నోటీసులు జారీ చేయడంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎగ్జిబిషన్ను మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. ఈ నెల 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుమాయిష్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.