ఆదిలాబాద్: పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ అంశాలపై ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేస్తారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కింది లింక్ద్వారా యూట్యూబ్లో లైవ్ద్వారా కూడా వీక్షించవచ్చు.