నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ, కాంగ్రెస్ ఏకమైనా సీఎం కేసీఆర్ను దించలేరని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను గద్దె దించే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్కు కృతజ్ఞత పేరుతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడారు.
‘టీఆర్ ఎస్లో చేరేందుకు 300 సార్లు సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొని బతిమిలాడినోడివి.. నువ్వా కేసీఆర్ను ఓడించేది’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై నిప్పు లు చెరిగారు. ‘కేసీఆర్ కాలి గోటికి సరిపడని నువ్వు, మీ అన్న.. మందిని ముంచిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. గులాబీ జెండా ముందు మీ ఆటలు సాగవు.
చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు మీ బాగో తాలను గమనిస్తున్నారు. నమ్ముకున్న ప్రజలకు, నీడ నిచ్చిన పార్టీకి ద్రోహం చెయ్యాలనుకుంటున్న నువ్వా ఎదుటి వారి గురించి మాట్లాడేది? సీఎం కేసీఆర్ను విమర్శించే నైతికతే నీకు లేదు. మేం నోరు విప్పితే మీరు బయట తిరగలేరు’ అని హెచ్చరించారు. ‘సొంత పార్టీలో ప్రతి ఒక్కరినీ దూషించే మీ నైజం జోకర్లను, బఫూన్లను మైమరిపిస్తున్నది.
మూడున్నరేండ్ల పదవీ కాలమంతా కాంట్రాక్టుల కోసం అమిత్షా వద్ద మోకరిల్లడం, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే సరిపో యింది. ఈ క్రమంలోనే జార్ఖండ్, సిమ్లా, ఛత్తీస్గఢ్ తిరిగిన చరిత్ర నీది కాదా? నువ్వు నిర్లక్ష్యం చేసిన నీ నియోజకవర్గంలో జిల్లా ఇంచార్జి మంత్రిగా 50 గ్రామా లు పర్యటించడంతోపాటు అర్ధరాత్రి దాకా ఇంటింటికి పర్యటిస్తూ 1,500 మంది కి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన చరిత్ర నాది. అటువంటి మంత్రి చేతినుంచి మైక్ గుంజుకున్న కుసంస్కారం నీది’అని జగదీశ్రెడ్డి విమర్శించారు.
జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మొట్టమొదటగా ప్రతిపాదనలోకి వచ్చిందే గట్టుప్పల్ మండలమని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ వద్ద తొలిసారిగా ప్రతి పాదించింది కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. అటువంటి మండలాన్ని చివరి నిమిషంలో అడ్డుకొన్నది కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డేనని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో పిటిషన్ వేయించి అడ్డుకొన్నారని ఆరోపించారు. కాగా గట్టుప్పల్ సర్పంచ్ ఇడెం రోజా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.