అధికారులకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కా ర్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికీ తాగునీరు సరఫరా అవుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. వర్షాకాలం మొదలయ్యే వరకు ఇదే ఉత్సాహంతో ప్రతి గ్రామానికి, ఆవాసానికి నీరు అందేలా చూడాలని సూచించారు. నీటి సరాఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెం టనే పరిషరించాలన్నారు. ప్రజలంతా మిషన్ భగీరథ నీటినే తాగేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.