Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం సుదర్శన నారసింహుడిని కొలుస్తూ హవనం చేశారు. 100 సుదర్శన శతకాలను పఠిస్తూ ఆహుతులు జరిపారు. స్వయంభూ నారసిసంహుడికి నిత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి తులసీ నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులతో నిర్వహించే ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధిసేవ, దర్భార్ సేవ, రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమాలు జరిపి ఆలయాన్ని మూసివేశారు. సువర్ణమూర్తులకు బంగారు పుష్పాలతో పలు ధపాలుగా అర్చనలు జరిగాయి. స్వామివారిని సుమారు &వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. &.ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామివారిని కాశీకి చెందిన అఘోర గజేంద్ర గోస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.