లక్నో: ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో పోలీసులు ఓ డెయిరీ నిర్వాహకుడిని రూ.20 లక్షలు ఇవ్వాలని.. లేదం టే ఎన్కౌంటర్లో కాల్చేస్తామని బెదిరించిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రిసల్దరన్ ఏరియాకు చెందిన డెయిరీ షాపు నిర్వాహకుడు సల్మాన్ ఏప్రిల్ 30న ఇంటికి తిరిగి వెళ్తుండగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కు తరలించారు. తమకు రూ.20లక్షలు ఇవ్వాలని లేదంటే మాదకద్రవ్యాల కేసులో ఇరికించి ఎన్కౌంటర్లో కాలికి బుల్లెట్లు దింపుతామని బెదిరించారంటూ సల్మాన్ ఆరోపించారు. చివరకు తన కుటుంబ సభ్యులతో రూ.6లక్షలు తెప్పించి ఇచ్చిన తర్వాతే పోలీస్ స్టేషన్ నుంచి విడిచిపెట్టారని.. అప్పటి దాకా తనను కొడుతూ హింసించారని సల్మాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం గురించి బయటకు చెబితే తనతోపాటు తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారని సల్మాన్ ఫిర్యాదు చేసినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపక్కుమార్ తెలిపారు. ఈ కేసులో సబ్ ఇన్స్పెక్టర్తోపాటు మరో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశామని వెల్లడించారు.