వనపర్తి : కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో సోమవారం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు పనులు తక్షణమే పూర్తిచేసి వచ్చే సీజన్లో సాగునీరందించే వరకు పోరాడుతామ న్నారు. ఆరు గ్యారెంటీల పేరిట దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను నయవంచన చేస్తూ అధికారం చేపడుతున్నారని విమర్శించారు.