పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పిడుగుపాటుకు (Lightning) పాడి ఆవులు మృతిచెందాయి. మండలంలోని కుక్కలగూడూర్లో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగుల కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కందుల ఆగయ్య అనే రైతుకు చెందిన తొమ్మిది ఆవులు, ఒక లేగ దూడ మృతి చెందాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కుటుంబ పోషణకు ప్రధాన ఆధారమైన ఆవులను కోల్పోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆగయ్య ఆవేదన వ్యక్తంచేశారు.