జహీరాబాద్/సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామ శివారులో ఉన్న నారింజ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతున్నది. నారింజ ప్రాజెక్టు నిండిపోవడంతో గేట్ల పైనుంచి వరద నీరు కర్ణాటక వైపు పరుగులు తీస్తుంది.నారింజ ప్రాజెక్టు నీటి సామర్థ్యం నిలువ 58 mcft గా ఉంది. ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు గేట్లు పై నుంచి 4 ఇంచుల ఎత్తులో నీరు ప్రవహిస్తుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. నీటి ప్రవాహం పెరిగితే గేట్లు ఎత్తి వేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు