హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 648 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,406కు పెరిగింది. ఇవాళ్టివరకు మొత్తం 6,32,728 మంది కోలుకున్నారు. మరో 8,873 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,805 చేరాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 83,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.