వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు మంత్రి ప్రశాంత్రెడ్డి సూచనలు
కొత్త సెక్రటేరియట్ పనుల పరిశీలన
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రోజుకు 50 క్యూబిక్ మీటర్ల చొప్పున ప్రతి రోజు ఐదు లారీల ధోల్పూర్ స్టోన్ తెప్పించి, 60 రోజుల్లో బేస్మెంట్ ఎలివేషన్ పనులు పూర్తయ్యేలా చూడాలని వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి మూడు షిప్టుల్లో స్టోన్ డిజైన్ పనులు వేగంగా చేయాలని సూచించారు. మెయిన్ ఎంట్రీ ఆర్నమెంట్ రెయిలింగ్ గ్రిల్, యూపీవీసీ విండోస్ శాంపిల్స్, మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ మెట్ల మార్గంలో వాడే రెయిలింగ్ డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైఅంతస్థు వరకు నిర్మాణపనులు సమాంతరంగా జరగాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఆర్అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్లు ఆస్కార్, పొన్ని తదితరులు ఉన్నారు.