జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల మొగుళ్లపల్లి మండలంలో రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన మన బేధం లేకుండా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ అయిలయ్య, మండల పార్టీ ప్రెసిడెంట్ కత్తి సంపత్, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతి రెడ్డి, స్థానిక సర్పంచ్ సరోత్తం రెడ్డి,ఎంపిటిసి ఆది రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ