నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండల పరిధిలో గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలంలోని సీలేరు గ్రామం నుంచి మిర్యాలగూడకు అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ మండల పరిధిలోని వాటర్ ట్యాంక్ తండా వద్ద పోలీసుల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. గంజాయి తరలిస్తున్న 6 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంజాయి విలువ సుమారుగా రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ