హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయా లు, ఉద్యోగ కల్పనపై అస్పష్ట విధానం వల్ల దేశంలోని యువశక్తి నిర్వీర్యమైపోతున్నది. దేశాభివృద్ధి తిరోగమనంలో సాగుతున్నది. యువతకు ఉద్యోగ కల్పనలో కేంద్రం వెనుకబడిపోయింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆ ర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) నివేదికలో ఇదే విష యం మరోసారి బహిర్గతమైనది. నిరుడుతో పోలిస్తే 2022 రెండో త్రైమాసికంలో ఉద్యోగ కల్పనపై నివేదిక విడుదలచేసింది. ఆరు రాష్ర్టా ల్లో ఉద్యోగ కల్పన ఆందోళనకరంగా ఉన్నదని తెలిపింది. అందులో నాలుగు రాష్ర్టాల్లో డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉన్నది. తెలంగాణ సిద్ధించిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపా ధి కల్పిస్తూ అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తాజాగా ఈపీఎఫ్వో నివేదిక ప్రకా రం.. 18-28 ఏండ్ల్ల మధ్య వయసున్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశానికే రోల్ మాడల్ అని బీజేపీ చెప్తున్న గుజరాత్ మాత్రం అట్టడుగుకి చేరింది. ఆరు రాష్ర్టాల్లో ఉద్యోగ కల్పన ఆందోళకరంగా ఉన్నదని ఈపీఎఫ్వో పేర్కొన్నది. అందులో పంజాబ్, జార్ఘండ్ను మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న హిమాచల్ప్రదేశ్లో 10.32 శాతం, అస్సాంలో 3.70 శాతం, గుజరాత్లో 3.39 శాతం, రాజస్థాన్లో 1.14 శాతం ఉద్యోగ కల్పన తగ్గింది. ఢిల్లీతోపాటు 15 రాష్ర్టాల్లో యువతకు ఉద్యోగ కల్పన పెరిగింది. కేంద్ర ప్రాంత పాలితమైన ఢిల్లీలో 29 శాతం ఉద్యోగ కల్పన పెరిగింది. బీహార్ 36.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ 22.8 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసలో ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు ఉన్నాయి.
దేశంలో ప్రతి నాలుగింట ఒక పోస్టు ఖాళీగానే ఉన్నది. మోదీ ఎన్నికల హామీల్లో భాగంగా యువతకు ప్రతి ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఈ విషయాన్ని మోదీ పూర్తిగా మరిచిపోయారు. మోదీ చెప్పినట్టు ప్రతిఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తే.. ఇప్పటి వరకు 16 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. కానీ, ఈ ఏడాది రెండో త్రైమాసికం వరకు ఏడేండ్లలో ఏడు లక్షల ఉద్యోగాలే కల్పించారు. అందులో.. 2021-22వ సంవత్సరంలో భర్తీ చేసింది కేవలం 38 వేల ఉద్యోగాలు. ఏడు లక్షల ఉద్యోగాలకు సుమారు 22 కోట్ల మంది దరఖాస్తు చేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నిరుడుతో పోలిస్తే.. ఉద్యోగాల కల్పన శాతం గణనీయంగా తగ్గడం చూస్తే మోదీకి యువతపై ఎంత శ్రద్ధ ఉన్నదో ఇట్టే తెలుస్తున్నది. సర్కారీ కొలువులకే దిక్కులేదు.. ఇక ఉద్యోగ కల్పన ఏం చేస్తారని దేశ యువత నిరాశకు గురవుతున్నది..