Rahul Gandi | హైదరాబాద్: రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారని విమర్శించారు. 80వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శనాస్ర్తాలు సంధించారు.
మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు తేడా తెలియకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను మక్కీకి మక్కీ రాహుల్గాంధీ చదివారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ర్టాల్లో రూ.500 నుంచి రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇస్తూ.. తెలంగాణలో రూ.4వేలు ఇస్తామంటే ఎలా నమ్ముతామని నిలదీశారు. కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లో అమ లు చేసిన తర్వాత తెలంగాణ గురించి మాట్లాడాలని చురకలంటించారు. మో సం కాంగ్రెస్ నైజం అని విమర్శించారు.