హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫార్సులు చేసేందుకు నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ బుధవారం రాష్ర్టానికి రానున్నది. రెండు రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించనున్నది.
కేంద్ర జల్ సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఐదుగురు సభ్యుల బృందం మూడు బ్యారేజీలపై సమగ్ర అధ్యయనం కోసం సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో చర్చించి బరాజ్ల హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ అంశాలను నిర్ధారించనున్నారు. నాలుగు నెలల్లోగా నివేదికను సమర్పించాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది.