మహబూబ్నగర్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ జిల్లా అధికారులతో నేరుగా, నారాయణపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి పంద్రాగస్టున బహుమతులను ప్రదానం చేయాలని సూచించారు.
15న గ్రామాల్లో, పట్టణాల్లో యువతకు షటిల్ కిట్లను అందించేలా చూడాలన్నారు. 9న జాతీయ పతాకాల పంపిణీ, 10న వనమహోత్సవంలో మొక్క లు నాటడం, క్రీడా పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్, 12న జాతీయ సమైక్యత రక్షా బంధన్, 13న విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి త్రివర్ణ బెలూన్లను ఎగురవేయాలని సూచించారు. 14, 15వ తేదీల్లో స్వాతంత్య్ర దినవేడుకలు, 16న రాష్ట్రవ్యాప్తంగా సాముహిక జాతీయ గీతాలాపాన, 17న రక్తదాన శిబిరాల ఏర్పాటు, 18న ఫ్రీడం పేరుతో క్రీడాపోటీలు, 19న దవాఖానలు, వృద్ధ్దాశ్రమాల వద్ద పండ్ల పంపిణీ, 20న స్వయం సహాయక సంఘాల మహిళాలతో అన్ని ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు, 21న జిల్లా, మండల, గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, 22న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ జెండాలను కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.