వరంగల్ : ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేరవుతున్న దామెర రాకేశ్ మృతికి నిరసనగా రేపు నర్సంపేట నియోజకవర్గం బంద్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపటి నియోజకవర్గం బంద్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ బంద్కు సహకరించాలని కోరారు.
రాకేశ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అగ్నిపథ్ను ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అని ఎమ్మెల్యే అడిగారు. మృతుడు రాకేశ్ దబ్బీర్పేట రైతు సమితి కో ఆర్డినేటర్ కుమారుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన పోలీసుల కాల్పుల్లో రాకేశ్ మృతి చెందిన సంగతి తెలిసిందే.