హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు. ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల డిమాండ్ విధించారు.
ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. గత వారం జగజ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.65.50 లక్షల నగదు, రూ.1.51,08,175 విలువైన 3.639 కిలోల బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఆమెకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు