హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ‘ఎస్ఎంసీల్లేవు.. నిధులు రావు’ శీర్షిక పేరిట ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. ఎస్ఎంసీలను రద్దుచేయడం, జాయింట్ చెక్ పవర్ను ఇతరులకివ్వకపోవడం.. నిధులు బ్యాంకుల్లో మూలుగుతుండటంపై జరుగుతున్న నష్టాన్ని ఆ కథనంలో వివరించింది.
ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ స్పందించి పాఠశాలలోని సీనియర్ టీచర్కు చెక్పవర్ బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.