హైదరాబాద్: నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.
1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్పై విజయం సాధించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాగర్కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.